Wednesday, May 15, 2024

Telangana – రేపే టెన్త్ రిజల్స్ట్ – రిలీజ్ చేయనున్న తెలంగాణ విద్యాశాఖ

హైద‌రాబాద్ : తెలంగాణలో రేపు టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్ష పేపర్ల మూల్యాంకనం, కంప్యూటరీకరణ కూడా పూర్తికావడంతో ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు. పదో తరగతి ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించారు… మొత్తం 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 2,7,952 మంది, బాలికలు 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే.. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తి చేశారు..అనంత‌రం కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ కూడా ముగించారు..

క్లిక్ చేయండిలా..
https://results.cgg.gov.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ పదవ ఫలితాలను తెలుసుకోవ‌చ్చు. విద్యార్థుల హాల్‌టికెట్‌ నంబర్‌ను నమోదు చేస్తే, ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాలతోపాటు మార్కుల మెమో ఉంటుంది. గతేడాది రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 13న ముగియగా.. మే 10న ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 15 రోజుల ముందుగానే పరీక్షలు పూర్తయ్యాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement