Sunday, April 28, 2024

TS : జగిత్యాల పీఠం కాంగ్రెస్ దే…. చైర్ ప‌ర్స‌న్‌గా జ్యోతి ఎన్నిక

గత సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న జగిత్యాల బల్దియా చైర్ పర్సన్ పదవి ఎట్టకేలకు అడువాల జ్యోతికి దక్కింది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో జ్యోతి ఒక్క ఓటు తేడాతో చైర్ పర్సన్‌గా నియామకం అయ్యారు.

దీంతో చైర్ పర్సన్ పదవిపై ఆశలు పెట్టుకున్న సమిండ్ల వాణికి నిరాశ తప్పలేదు. చైర్‌పర్సన్ ఎన్నిక కోసం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు జ్యోతి కి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికలో జ్యోతి కి 24ఓట్లు రాగా సమిండ్ల వాణి కి 23ఓట్లు వచ్చాయి. అయితే ఒక బిఆర్ఎస్ కౌన్సిలర్ సమావేశానికి హాజరు కాలేదు. చైర్ పర్సన్ ఎన్నికకు ముందు రోజు హై కమాండ్ జారీ చేసిన విప్ ను 12మంది కౌన్సిలర్లు ధిక్కరించారు. దీంతో ఒకే ఒక్క ఓటు తేడాతో జ్యోతికి చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి ద‌క్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement