Saturday, May 4, 2024

TS : చెరువులో పడి వ్యక్తి మృతి

కౌడిపల్లి, ఫిబ్రవరి 28(ప్రభ న్యూస్) : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన కౌడిపల్లి మండల పరిధిలోని కొట్టాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కొట్టాల గ్రామానికి చెందిన కొడకండ్ల ప్రభాకర్ మంగ‌ళ‌వారం కంచనపల్లిలో జరుగుతున్న జాతర ఉత్సవాలలో పాల్గొనే నిమిత్తం వెళ్ళగా రాత్రి వరకు ఇంటికి రాలేదు.

బుధవారం తెల్లవారుజామున కూడా కొడకండ్ల ప్రభాకర్ ఆచూకీ తెలవకపోవడంతో కుటుంబ సభ్యులు వెతక‌సాగారు. ఈ క్రమంలో కొట్టాల చెరువు కట్ట పైన ప్రభాకర్ దుస్తులు కనిపించడంతో చెరువులో పడి ఉంటాడని అనుమానంతో గాలింపు చేప‌ట్టారు. చేపల కోసం చెరువులో వేసిన వలకు చిక్కుకొని ప్రభాకర్ మృతి చెందాడు. కౌడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement