Sunday, May 5, 2024

బస్టాండ్‌ లేక ప్రయాణికుల ఇబ్బందులు..

వేమనపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎంతో వెనుకబడిన వేమనపల్లి మండల కేంద్రంలో ఇప్పటి వరకు బస్టాండ్‌ లేకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ కేంద్రానికి, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న బెల్లంపల్లి మండల కేంద్రంలో బస్టాండ్‌ లేకపోవడంతో ప్రయాణికులు అక్కడ ఉన్న వాటర్‌ ట్యాంకు గద్దెలపై కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. బెల్లంపల్లి పట్టణం నుండి వేమనపల్లికి బస్సు సౌకర్యం లేకపోవడంతో నియోజకవర్గ కేంద్రానికి రావడానికి వ్యయప్రయాసలకు గురవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వేమనపల్లి మండల కేంద్రంలో బస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement