Tuesday, May 14, 2024

మున్సిపల్‌ కమీషనర్‌ను కలిసిన కౌన్సిలర్లు..

బెల్లంపల్లి : మున్సిపాలిటీ నూతన కమీషర్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన జంపాల రజితను మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత-శ్రీధర్‌ సమక్షంలో కౌన్సిలర్లు కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 34 వార్డుల అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయించి వార్డుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పోలు ఉమాదేవి, సూరం సంగీత, కేంశెట్టి సరిత, షేక్‌ అస్మా, తుంగపల్లి సుజాత, రాజనాల కమల, సముద్రాల లావణ్య, తెరాస నాయకులు పోలు శ్రీనివాస్‌, సూరం బానేష్‌, కేంశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement