Saturday, May 18, 2024

TS: రేపటి రాహుల్ గాంధీ బహిరంగ సభను జయప్రదం చేయండి .. మంత్రి సీత‌క్క‌

నిర్మల్ ప్రతినిధి, మే 4 (ప్రభ న్యూస్) : మరో 9 రోజుల్లో జరగనున్న లోక్ స‌భ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కష్టపడి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సమిష్టి కృషితో అదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క నేతలకు పిలుపునిచ్చారు. నిర్మల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సీతక్క పార్టీ ఇంచార్జ్ శ్రావణ్ రెడ్డి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు శ్రీహర్రావులతో కలిసి మంత్రి మాట్లాడారు.

రేపు నిర్మల్ పట్టణంలోని క్రషర్ గ్రౌండ్ వద్ద ఉదయం 11 గంటలకు జరగనున్న‌ రాహుల్ గాంధీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రజలను కోరారు. పార్టీ అభ్యున్నతి కోసం ఇరువురు నేతలు మనస్పర్ధలు పక్కనపెట్టి 9 రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని ఇరువురు కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే దేశం అధోగతి అవుతుందని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా ప్రజల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీల సంక్షేమ పథకాలను ఇంటింట వివరించి ఓట్లు అడగాలని సూచించారు. రేపు నిర్మల్ లో జరగనున్న రాహుల్ గాంధీ సభను జయప్రదం చేసేందుకు నిర్మల్, ఖానాపూర్, ముధోల్ నియోజ‌క‌వ‌ర్గాల‌ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో జనాల‌ను తరలించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement