Sunday, May 19, 2024

పగిలిన మిషన్‌ భగీరథ పైపులైన్

కాసిపేట: కాసిపేట మండలం రొట్టెపెల్లి గ్రామపంచాయతీ పరిదిలోని చిక్రంగూడ గ్రామ సమీపంలో మిషన్‌ భగీరథ పైపులైన్‌ పగిలి తాగునీరు వృధాగా పోతోంది. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామాలకు తాగునీరు అందించే పైపులైన్‌ పగలగొట్టడంతో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందని గ్రామస్తులు పేర్కోన్నారు. ఇంతకు ముందు సైతం ఇలాగే పైపులు పగలగొట్టడంతో మరమ్మత్తులు జరిగే వరకు తాగు నీటికై ఇబ్బందులు పడ్డామని, ఈ చర్యలకు పాల్పడిన వారిని గుర్తించకపోవడంతో మళ్లీ ఈ పనులకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇప్పటికైనా పైపులైన్‌ పగులకొడుగతున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, మరల ఇలాంటి పనులకు పాల్పడకుండా చూడాలని గ్రామస్థులు సంబందిత అధికారులను కోరుతన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement