Monday, May 6, 2024

కార్మికుడి మృతికి సంతాపం

కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో విధులు నిర్వహిస్తున్న ముత్తె నారాయణ అనే కార్మికుడు గుండెపోటు వచ్చి మృతిచెందాడు. గనిపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో అధికారులు, కార్మికులు కార్మికుడి మృతిపట్ల మౌనం పాటించి సంతాపం తెలియచేయగా, కార్మిక సంఘాల నాయకులు నారాయణ మృత దేహాన్ని సందర్శించి నివాలులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వొడ్నాల రాజన్న,
మేడ సమ్మయ్య, దుగుట శ్రీనివాస్‌,దాగం మల్లేష్‌, గని అధికారులు, నాయకులు, కార్మికులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement