Friday, April 26, 2024

నిబంధనలు ఉల్లంగిస్తున్న మాతరిణి హోటల్‌..

శ్రీరాంపూర్‌ : బస్టాండ్‌ ఏరియాలో మాతరిణి అనే హోటల్‌ యాజమాన్యం కర్ఫ్యూ నిబంధనలను భేఖాతరు చేస్తోంది. ఆ హోటల్‌ యాజమాన్యం తీరు పట్ల ప్రజలు కర్ఫ్యూ నిబంధనలు ఈ హోటల్‌కు వర్తించవా అని తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు హోటల్‌ను మూసి వేయాల్సి ఉండగా అవేమి పడ్డకుండా హోటల్‌ సేవలను కొనసాగిస్తున్నారు. రాత్రి సమయంలో హోటల్‌ ముందు మూసేసి వెనుక భాగం నుండి తమ సేవలను అందిస్తున్నారు. హోటల్‌లో ఎలాంటి భౌతిక దూరం పాటించకుండా, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారికి దురుసుగా సమాదానం చెప్తూ నువ్వు ఎవరికి చెప్పుకుంటావో… చెప్పుకో… ఏం చేసుకుంటావో… చేసుకో అంటూ బెధిరింపు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు పలువురు వాపోయారు. నిబంధనలను తుంగలో తొక్కుతూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్న ఇలాంటి హోటల్‌ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement