Saturday, April 27, 2024

కేసీఆర్‌ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు..

కాసిపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కరోనా పాజిటివ్‌ నుండి త్వరగా కోలుకోవాలని గుర్తింపు సంఘం నాయకులు దుగుట శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మందమర్రి ఏరియా కాసిపేట గని మైసమ్మ దేవాలయంలో టీబీజీకెఎస్‌ నాయకులు, కార్మికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికి కరోనాను నియంత్రించ లేకపోతున్నామని అన్నారు. దేశ, రాష్ట్ర నాయకులు, అధికారులు సైతం కరోనా బారిన పడుతున్నారని, వ్యాధి పెరిగి పలువురు చనిపోతున్నారని బాధను వ్యక్తం చేశారు. గని ఉద్యోగులు తప్పనిసరిగా అధికారుల సూచనలతో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రజల దీవెనలు వున్న కేసీఆర్‌ త్వరగా కోలుకుంటారని, బంగారు తెలంగాణ సాధనకై విరామమెరుగక పాటుపడతారననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకులు సొల్లంగి శ్రీనివాస్‌, బానోత్‌ తిరుపతి, దొమ్మటి రమేష్‌, బండారి రమేష్‌,బదిలీ వర్కర్‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భువనచంద్ర, నాయకులు, కార్మికులు తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement