Sunday, April 28, 2024

తెలంగాణలో 495 మైక్రో కంటైన్మెంట్ జోన్‌లు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మొన్నటివరకు జీహెచ్‌ఎంసీ, మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పరిధికే పరిమితమైన వైరస్‌ వ్యాప్తి గడిచిన వారంలో అన్ని జిల్లాల్లోనూ తీవ్రమైంది. గ్రామీణ జిల్లాల పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం కట్టడి చర్యలను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అధికారులు రాష్ట్రంలో 495 మైక్రో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు.

ఆదిలాబాద్ 11, భదాద్రి కొత్తగూడెం 13, హైదరాబాద్ 70, జగిత్యాల 6, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 10, జోగులాంబ గద్వాల 9, కామారెడ్డి 2, కరీంనగర్ 10, ఖమ్మం 25, కొమురంభీం ఆసిఫాబాద్ 18, మహబూబ్‌నగర్ 4, మంచిర్యాల 10, మెదక్ 7, మేడ్చల్ మల్కాజ్‌గిరి 32, ములుగు 18, నాగర్‌కర్నూల్ 13, నల్గొండ 16, నిర్మల్ 32, నిజామాబాద్ 66, పెద్దపల్లి 7, రాజన్న సిరిసిల్ల 8, రంగారెడ్డి 23, సంగారెడ్డి 3, సిద్దిపేట 1, సూర్యాపేట 20, వికారాబాద్ 29, వనపర్తి 2, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 11, యాదాద్రి భువనగిరి 16.

Advertisement

తాజా వార్తలు

Advertisement