Sunday, April 28, 2024

పౌర్ణమి ధ్యానం..

కాసిపేట : కాసిపేట మండలం దేవాపూర్‌ ప్రకృతివనంలో మండలంలోని సామాజిక చైతన్యవేదిక ఆద్వర్యంలో పౌర్ణమి ధ్యానం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ,మనస్సు ప్రశాంతత, ఏకాగ్రత, ఆరోగ్యానికి ధ్యానం చాలా ఉపయోగపడుతుందని అన్నారు.మండలంలో ప్రభుత్వం చేపట్టిన వనాలలో ధ్యాన కేంద్రాల ఏర్పాటుకు సంబందిత అధికారులు, ప్రజాప్రతినిధులను సంప్రదించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేదిక అధ్యక్షుడు పల్లె పల్లయ్య, ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్‌,ప్రధాన కార్యధర్శి కొమ్ముల బాపు,పూలాజి బాబా ధ్యాన కేంద్రం సభ్యుడుమానుకు పటేల్‌ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement