Sunday, May 19, 2024

ABD | రూ. 3.20 కోట్లతో చెక్ డ్యాముల నిర్మాణం : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఆదిలాబాద్ , ఉట్నూర్ (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హర్కాపూర్ శ్యామ్ నాయక్ తండా గ్రామాల్లో 3.20 కోట్లతో నిర్మించనున్న చెక్ డ్యాంల నిర్మాణానికి శనివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఒక్కో చెక్‌డ్యామ్‌ను 20 లక్షలతో నిర్మిస్తామని, పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. వ్యవసాయ సాగుకు ఈ చెక్ డ్యామ్లా నిర్మాణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్‌ ఎంపీపీ పాండ్ర జయవంతరావు, తాషా మాజీ సర్పంచ్‌ జాదవ్‌ హరినాయక్‌, మైనర్‌ ఇరిగేషన్‌ డీఈ వినోద్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement