Wednesday, May 8, 2024

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు

జైనూర్, జులై 7 (ప్రభ న్యూస్) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాంనగర్, పవర్ గూడ, సంబాజి గూడ, గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మీ క్యాంప్ ఆఫీసులో కోవ లక్ష్మీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారని జైనూర్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కుమ్ర భగవంతు రావు తెలిపారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గుగ్గే కేశవ్, వాగ్మరే శేషారావు, నర్సింగ్, కారాడ్ అశోక్, డైపలే సంతోష్, భూతలే గోవిందరావులు చేరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి భగవంతు రావ్, ఉప సర్పంచ్ సమాధాన్ డోగ్రే, ముండే సతీష్, బీర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement