Monday, May 6, 2024

ADB: అభివృద్ధి పనులకు బోథ్ ఎమ్మెల్యే శ్రీకారం

తాంసి, జనవరి 4(ప్రభన్యూస్): ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మొదటిసారిగా తాంసి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆర్అండ్‌బీ నిధుల ద్వారా మంజూరైన 12 కోట్ల రూపాయలతో కప్పర్ల నుంచి పొచ్చర వరకు బండల్ నాగపూర్ నుండి సావర్గం,పొన్నరి వరకు నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.

అనంతరం బండల్ నాగపూర్ గ్రామంలోని రామలయాన్ని దర్శించుకొని నూతన షెడ్డును ప్రారంభించారు. అదే విధంగా హస్సేన్ హుస్సేన్ దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement