Monday, May 6, 2024

Bhuvaneshwari: అసిరినాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి

శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘‘నిజం గెలవాలి’’ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ‌ ఉదయం ఎచ్చెర్ల నియోజకవర్గం జి.సిగడం మండలం దవలపేట గ్రామానికి భువనేశ్వరి చేరుకున్నారు. దవలపేట గ్రామంలో కంచరన అసిరినాయుడు కుటుంబాన్ని నారా భువనేశ్వరి పరామర్శించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక అసిరినాయుడు (55సం.లు) అక్టోబర్ 4న గుండెపోటుతో మరణించారు. ఆసిరి నాయుడు కుటుంబాన్ని పరామర్శించి రూ.3లక్షలు చెక్కు అందించిన భువనేశ్వరి. ఆమె వెంట మాజీ మంత్రి కళావెంకటరావు, టీడీపీ జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్, జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement