Sunday, April 28, 2024

AP MINISTER: కుటుంబాలను చీల్చి రాజకీయం చేయడం సోనియా, చంద్రబాబుల‌కు అల‌వాటే – మంత్రి పెద్దిరెడ్డి

పుంగ‌నూరు – కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇలా ఎన్ని పార్టీలు వచ్చినా మేం, మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వెంటే నడుస్తాం అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి .. కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అంటూ మండిపడ్డారు.. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్న ఆయన.. రాష్ట్ర ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్ ను గెలిపించాలని చూస్తున్నారని స్పష్టం చేశారు.

జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిల నేడు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేప‌థ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మార్పులు చేర్పులు సహజం. జగన్ మా నాయకుడు ఆయన కోసం మేం ఎప్పటికీ పని చేస్తూనే ఉంటాం అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. మా పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ప్రత్యర్థిగా చూస్తాం అన్నారు. గతంలో మా నాయకుడు జగన్ పై అక్రమ కేసులు బనాయించి 16 నెలలు జైలుపాలు చేశారని మండిపడ్డారు. అందుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పార‌న్నారు. రాజ‌కీయంగా మా కాళ్లను మేం నరుక్కోం.. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా రాజకీయ ప్రత్యర్ధిగానే చూస్తాం అని కామెంట్ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరోవైపు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వ్యాఖ్యాల‌పై మంత్రి స్పందిస్తూ, జెడ్పీటీసీగా ఓడిన వ్యక్తిని మేం ఎమ్మెల్యేగా గెలిపించాం.. ఇలాంటివి మాట్లాడే ముందు ఆలోచన చేయాలన్నారు. ఎవరో రెచ్చగొడితే అలా మాట్లాడటం సబబు కాదు అని.. ఇప్పటికైనా అయన పునరాలోచలో చేయాలని కోరుకుంటున్న.. ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement