Sunday, April 28, 2024

Corona: రోజు రోజుకు పెరుగుతున్న క‌రోనా కేసులు ..దేశం మొత్తం మీద 4420 పాజిటివ్స్

న్యూ ఢిల్లీ – దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత నెల క్రితం కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 760 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి.

దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. గడిచిన 24 గంటల్లో కేరళ, కర్ణాటకలో ఒక్కొక్కరి చొప్పున ఇద్దరు మరణించారు.ఇది ఇలా ఉంటే , దేశంలో కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కోట్ల మందికి కోవిడ్-19 సోకింది. వీరిలో 5.3 లక్షల మందికి పైగా మరణాలు సంభవించాయి. ఈ వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.4 కోట్లకు పైగా ఉంది. రికవరీ రేటు దేశంలో 98.81 శాతం ఉందని, ఇప్పటి వరకు దేశంలో 220.67 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ అందించినట్లు కేంద్రం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement