Sunday, April 28, 2024

MP Gorantla స‌జ్జ‌ల‌తో కోట్లాట‌..అబ్బే అదేం లేద‌న్న ఎంపి

అనంత‌పురం: తాడేపల్లిలో పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన‌ స‌మ‌యంలో తాను కోట్లాడినట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదని కొట్టిపారేశారు హిందూపురం వైసిపి ఎంపి గోరంట్ల మాధ‌వ్. నేడు ఆయ‌న అనంత‌పురంలో మీడియాతో మాట్లాడుతూ, అనేక కారణాలతో పార్టీలో మార్పులు చేశార‌ని, ఆవిష‌యంపైనే స‌జ్జ‌ల‌తో చ‌ర్చించాన‌న్నారు.

త‌న‌ను ఇక్కడ తప్పించినా పార్టీ సరైన గౌరవం ఇస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇక త‌న‌కు వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్నతల్లి లాంటిద‌ని, పార్టీ నిర్ణయాన్ని శిరసావహించటం బాధ్యతగా భావిస్తున్నాన‌ని పేర్కొన్నారు. 2024 ఎన్నిక‌ల్లో సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీటు కోసం తాను పార్టీ పెద్దలు ఎవరిపై ఒత్తిడి చేయలేద‌ని స్పష్టం చేశారు. తాను ఎప్ప‌టికీ పార్టీ విధేయుడినేన‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement