Saturday, April 27, 2024

20 నుంచి 27వ వరకు ‘శ్రీమద్భాగవత సప్తాహం’

బెల్లంపల్లి : ఈ నెల 20వ తేది నుండి 27వ తేది వరకు బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో పంచాక్షరి క్షేత్రంలో డాక్టర్‌ బాచంపల్లి సంతోష్‌కుమార్‌ శాస్త్రిచే 6వ శ్రీమద్భాగవత సప్తాహం నిర్వహిస్తున్నామని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, శ్రీవాసవి భజన బృంధం సహాయ సంఘం సభ్యులు చిలువేరు దయాకర్‌, రేణికుంట్ల శ్రీనివాస్‌, పాత అశోక్‌, కనుకు నందయ్య, అంజయ్య, శ్రీదర్‌, చెన్నూరి పోచంలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాసవి భజన బృంధం సహాయ సంఘం ఆధ్వర్యంలో ధర్మ పరిరక్షణ కోసం, ప్రపంచ శాంతికోసం ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, కాశీ నుండి కన్యకుమారి వరకు 24 గంటల 51 భజన కార్యక్రమాలు, 5 భాగవత సప్తాహాలు, ఇటీవల 21 రోజులు 504 గంటల భజన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రపంచ స్థాయి జీనియస్‌ వరల్డ్‌ బుక్‌ రికార్డు సాధించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ నెల 20 నుండి 27వ తేది వరకు జరిగే శ్రీమద్భాగవత సప్తాహంలో పాల్గొనాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement