Wednesday, May 1, 2024

జీవీఎంసీ మేయర్ ఎన్నికపై ముందే చెప్పిన ఆంధ్ర ప్రభ

జీవీఎంసీ మేయర్ ఎన్నిక విషయంలో ఆంధ్రప్రభ చెప్పింది అక్షర సత్యం అయింది. జీవీఎంసీ మేయర్ పదవి హరి వెంకటకుమారికే దక్కింది. జీవీఎంసీ కార్పోరేటర్ల సమావేశంలో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. హరి వెంకటకుమారికే మేయర్ పదవి కట్టబెట్టనున్నట్లు ఆంధ్రప్రభ ముందుగానే పేర్కొంది. హరి వెంకట కుమారి ప్రథమ జివీఎంసీ మేయర్ కానుందని ఆంధ్రప్రభ రాసిన కాలంలో పేర్కొంది. ఇక జీవీఎంసీ కార్పోరేషన్ మేయర్ పదవిని దక్కించుకోవాలని వైసీపీ చేసిన ప్లాన్ సక్సెస్ అయింది. కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెంట్రల్ పార్క్ హోటల్ లో సమావేశమయి మేయర్ ని నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement