Friday, May 3, 2024

అంబులెన్స్‌లో డెలివరీ..

కన్నెపల్లి : కన్నెపల్లి మండలంలోని ఎల్లారం గ్రామానికి చెందిన బొలిశెట్టి శోభారాణి అనే నిండు గర్భిణీ మహిళకు పురిటినొప్పులు ఎక్కువ కావడంతో 108కు సమాచారం అందించగా 108 సిబ్బంది శోభారాణిని బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ ఎ.సారయ్య, పైలెట్‌ సాదిక్‌లు అంబులెన్స్‌ను ప్రక్కన ఆపి సుఖ ప్రసవం అయ్యేలా చేశారు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లి, బిడ్డలు సురక్షితంగా ఉండేలా సుఖ ప్రసవం చేసిన ఈఎంటీ సారయ్య, పైలెట్‌ సాదిక్‌లను వైద్యాధికారులు అభినందించగా, శోభారాణి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement