Wednesday, April 17, 2024

కూలిన పైస్లాబ్‌ నిర్మాణం..

కాసిపేట : కానరాని అధికారుల పర్యవేక్షణ, లోపించిన నాణ్యత వెరసి నిర్మాణంలోనే వైకుంఠధామం పై స్లాబ్‌ నిర్మాణం కూలిపోయింది. కాసిపేట మండలం సోనాపూర్‌ గ్రామంలో సుమారు రూ.11 లక్షల నిధులతో చేపట్టిన వైకుంఠదామం యెక్క పై సిమెంట్‌ స్లాబ్‌ నిర్మాణం కూలిపోయింది. సంబందిత అధికారులు జరుగుతున్న నిర్మాణ పనుల పర్యవేక్షించాల్సిన భాధ్యతలు విస్మరించడం, ఇంజనీరింగ్‌ శాఖ అధికారులు దగ్గర ఉండి మెటెరియల్‌ సిమెంట్‌, కంకర నాణ్యతను చూడడంలో నిర్లక్షం వహించారనే ఆరోపణలున్నాయి. సుధీర్ఘకాలం మన్నికతతో ఉండాల్సిన నిర్మాణాలు ఆదిలోనే నేలమట్టం కావడం పలు విమర్శలకు తావిస్తుంది. ఇప్పటికైనా మండలంలో చేపట్టిన పల్లె ప్రగతి అభివృద్ది పనులు సంబందిత అధికారుల పర్యవేక్షణలో జరిగేలా చర్యలు చేపట్టాలని, సోనాపూర్‌ గ్రామంలో కూలిన వైకుంఠదామం పనులపై విచారణ చేపట్టాలని మండలవాసులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement