Wednesday, May 8, 2024

Accident – చెట్టును ఢీకొన్న బైకు.. ఒకరు మృతి… మరొకరి పరిస్థితి విషమం

కడెం. జూన్ 29 ప్రభా న్యూస్ – నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో చెట్టును ఢీకొన్న బైకు ప్రమాదంలో ఒక‌రు మ‌ర‌ణించారు.. మ‌రోక‌రు గాయ‌న‌ప‌డ్డారు. వివ‌రాల‌లోకి వెళితే . సయ్యద్ సమీ , మొహమ్మద్ జియాన్ లు ద్విచక్ర వాహనంపై మండలంలోని చిన్నబెల్లల్ గ్రామానికి బయలుదేరి వెళ్లారు.

ఈ క్రమంలో మార్గమధ్యంలో రహదారి పక్కనే ఉన్న ఒక చెట్టును బైక్ ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి .. వైద్య చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో సయ్యద్ సమీ మృతి చెందాడు మరో యువకుడు మహమ్మద్ జియాన్ పరిస్థితి విషమంగా ఉంది.. బక్రీద్ పండుగ వేళ రోడ్డు ప్రమాదంలో సయ్యద్ సమీ మృతి చెందడం వారి కుటుంబంలో విషాదం నెలకొంది . జ‌యాన్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement