Wednesday, May 22, 2024

సీఎం జ‌గ‌న్ హ‌త్యకు కుట్ర: వైసీపీ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య

ఏపీ సీఎం జగన్‌ హత్యకు కుట్ర జరుగుతోందని అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను చంపి అధికారంలోకి రావాలని టీడీపీ చూస్తోందని ఆరోపించారు. అందుకే చంద్రబాబు జగన్ గాల్లో కలిసిపోతారని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలను రూ.50లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు చెప్పారని అన్నారు. హింసా రాజకీయాలకు, స్కాంలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్ మండిపడ్డారు.

స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో రూ.242 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు పాలనలో వేలకోట్ల ప్రజాధనం దోచుకున్నారన్నారు. టీడీపీ గౌరవ సభల పేరుతో డ్రామాలు ఆడుతోందని మండిపడ్డారు. అసెంబ్లీలో చంద్రబాబు ఏదో జరిగిపోయిందని హడావిడి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఇలాంటి పనులు చేస్తే ప్రజలు తరిమికొడతారని ఎమ్మెల్యే తోపుదుర్తి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement