Friday, April 26, 2024

జ‌స్టిస్ ఎన్వీర‌మ‌ణ అరుదైన రికార్డ్ – భార‌త్ , పాక్ ల స‌రిహ‌ద్దు సంద‌ర్శ‌న‌

భారత్, పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల్లోని వాఘా బోర్డ‌ర్ ని సంద‌ర్శించారు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ. వాఘా బోర్డ‌ర్ ను సంద‌ర్శించిన తొలి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ఎన్వీర‌మ‌ణ కావ‌డం విశేషం. దాంతో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ త‌న‌పేరిట ఓ అరుదైన రికార్డును లిఖించుకున్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ భార‌త స‌రిహ‌ద్దు ర‌క్ష‌క ద‌ళం(బీఎస్ఎఫ్‌) గౌర‌వ వంద‌నాన్ని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ స్వీక‌రించారు. తెలుగు నేల‌కు చెందిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ న్యాయ‌వాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి హైకోర్టు న్యాయ‌మూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. చివర‌కు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆయ‌న అత్యున్న‌త ప‌ద‌విని అలంక‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement