Sunday, May 5, 2024

అంటరానితనంపై పోరాటం చేసిన మహనీయుడు అంబేద్క‌ర్ : ఎమ్మెల్యే రాజయ్య

జనగామ : అంటరానితనం, వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ… అణగారిన వర్గాల్లో చైతన్యం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. ఆయన ఆశయసాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కందుల రేఖ,మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మండలపార్టీ అధ్యక్షులు మాచర్ల గణేష్, మార్కెట్ వైస్ చైర్మన్ చల్లా చందర్ రెడ్డి, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సురేష్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సింగపురం దయాకర్, పట్టణ అధ్యక్షులు మునిగేలా రాజు, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, రాజు, ప్రజాప్రతినిధులు, మార్కెట్ డైరెక్టర్ లు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement