Tuesday, April 30, 2024

అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం పాలన : మోతె శ్రీల‌త శోభ‌న్ రెడ్డి

అంబేద్క‌ర్ స్ఫూర్తితోనే తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని న‌గ‌ర డిప్యూటీ మేయ‌ర్ మోతె శ్రీల‌త శోభ‌న్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ లోని లోయ‌ర్ ట్యాంక్ బండ్ వ‌ద్ద భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతిని ఘ‌నంగా నిర్వ‌హించారు. న‌గ‌ర‌ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్ర‌హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ….దళితుల ఆత్మ బంధువు సీఎం కెసీఆర్..అంబేద్కర్ తర్వాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన వ్యక్తి, నేత కేసిఆర్ మాత్రమే..దళితుల ఆర్థిక సాధికారత కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నాం..అంబేద్కర్ కేవలం దళితుల వాడు మాత్రమే కాదు, ఆయన అందరి వాడని అన్నారు. ఈ కార్యక్రమంలో TTUC రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్ రెడ్డి, TRS నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement