Sunday, May 5, 2024

ఉక్కు ఉద్యమానికి సరైన రీతిలో స్పందన కరువు

ప్రతి రాష్ట్రంలోనూ సూపర్ స్టార్ లు ఉన్నారు. స్టార్ హీరోలు ఉన్నారు. అయితే ఆ రాష్ట్రాలలో ప్రజలకుఏం కష్టం వచ్చినా వారంతా మద్దతుగా నిలుస్తారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలా జరగట్లేదు. అమరావతి రాజధాని రైతుల సమస్యగానీ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యగానీ దేనిపైనా కూడా తెలుగు స్టార్స్ ఒక్కరు కూడా స్పందించలేదు. మెగాస్టార్ చిరంజీవి స్పందించినప్పటికీ ఏదో మద్దతు ప్రకటించాం అన్నట్టు ట్వీట్ పెట్టి ఊరుకున్నారు. అలాగే నారా రోహిత్, ఆర్ పి పట్నాయక్ కూడా మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టగా హీరో శివాజీ వైజాగ్ వెళ్లి బాధితులకు అండగా నిలిచారు. ఇక మిగిలిన హీరోలు అయితే పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు.

ఇదే విషయం పై సోషల్ మీడియాలో నెటిజన్స్ తెలుగు సినీ స్టార్స్ పై రకరకాల సెటైర్లు వేస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు. తిన్నామా… పడుకున్నామ… తెల్లారిందా అనే విధంగా తెలుగు హీరోలు ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. మరి ఇప్పటికైనా సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ తో అయినా సరే మన సినీ హీరోలు నిద్ర లేస్తారో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement