Wednesday, May 22, 2024

‘దేశ్ కా నేత కేసీఆర్’.. ముంబైలో తెలంగాణ సీఎం ఫ్లెక్సీలు

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు జాతీయ పార్టీల నాయకులను ప్రత్యేకంగా ఆయన కలిశారు. ఈ క్రమంలో తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముంబై నగరంలో దేశ్ కా నేత కేసీఆర్ నినాదంతో ఫ్లెక్సీలు వెలిశాయి. ముంబై ప‌ర్య‌ట‌న‌కు ఒక్క రోజు ముందే ముంబైలో తెలంగాణ బిడ్డ‌లు సీఎం కేసీఆర్‌కు సంబంధించి భారీ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసి, అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement