Thursday, May 2, 2024

ఆది పురుష్ కోసం – అవ‌తార్ మూవీ టెక్నాల‌జీ – క్లైమాక్స్ కోస‌మే రూ.60కోట్లు

ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కిస్తోన్న చిత్రం ఆదిపురుష్. 500కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. కొన్ని రోజుల క్రితం షూటింగ్ పార్టును పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఆగస్టు 11వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నున్నాడు. కాగా హాలీవుడ్ మూవీ ‘అవతార్’ కోసం ఉపయోగించిన టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నారట. దేశ విదేశాలకి చెందిన 50 మంది సాంకేతిక నిపుణుల టీమ్ ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 60 కోట్ల వరకూ ఖర్చు చేశార‌ట‌. రామాయణం నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలకి మించి ఈ సినిమా ఉండనుందట‌. సీతారాములుగా కృతి సనన్ – ప్రభాస్ నటించగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడిగా దేవదత్త .. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement