Tuesday, May 14, 2024

కారును ఢీకొట్టిన లారీ.. ఎస్ఐ దుర్మరణం

హైదరాబాద్ శివారులోని ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ మృతి చెందాడు. ఓఆర్ఆర్ పై సిమెంట్ లోడ్‎తో వెళ్తున్న లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐ పల్లె రాఘవేందర్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శంషాబాద్ నుంచి తుక్కుగుడా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పల్లె రాఘవేందర్ గౌడ్ మహబూబ్ నగర్ రైల్వే పోలీస్ స్టేషన్‎లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement