Friday, April 26, 2024

Odisha: రైలు ప్రమాద ప్రాంతాన్ని సందర్శించిన ప్రధాని.. బాధితులకు పరామర్శ

ప్రధాని నరేంద్ర మోడీ ఘోర రైలు ప్రమాదం జరిగిన ఒడిశాలోని బాలాసోర్ కు చేేరుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్కడే ఉన్న కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు ప్రాథమిక నివేదిక వివరాలను ప్రధానికి వివరించారు. ప్రమాద స్థలంలో జరుగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు.

మరోవైపు ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. రైల్వే ఉన్నతాధికారులతో పాటు వివిధ విభాగాల అధికారులతో మోడీ భేటీ అయ్యారు. రైలు ప్రమాద బాధితులను ప్రధాని మోడీ పరామర్శించారు. కటక్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement