Thursday, May 16, 2024

Breaking: పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. వెళ్తారు.. రాహుల్ పై కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులు వస్తారు.. పోతారన్నారు. మొన్న ఒకరొచ్చారు.. నిన్న ఒకరొచ్చారన్నారు. ఏవో డైలాగులు రాసిస్తే చదివి వెళ్తారన్నారు. ఎంత మంది వచ్చి వెళ్లినా పనిచేసే నేతలు కావాలన్నారు. ప్రతిపక్ష నాయకుల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరో చెప్పిన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ లేకపోతే టీపీసీసీ, టీ బీజేపీ ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement