Friday, May 3, 2024

ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్న ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ – నెక్ట్స్ మూవీ నాగ‌చైత‌న్య‌తోనే

హీరో విజ‌య‌దేవ‌ర‌కొండ‌..ర‌ష్మిక మంద‌న న‌టించిన గీతగోవిందం సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ద‌ర్శ‌కుడు.. పరశురామ్ కు అన్నీ లక్కీ ఛాన్స్ లే వస్తున్నాయి. ప్రస్తుతం సర్కారువారి పాట సినిమా చేస్తున్న పరశురామ్.. నెక్ట్స్ మరో స్టార్ హీరోతో సినిమా లాక్ చేసేశాడు. తన తదుపరి సినిమా నాగచైతన్యతోనే ఉంటుందని స్పష్టం చేశారు. అంతా రెడీగానే ఉంది గనుక త్వరలోనే సెట్స్ పైకి వెళతామని చెప్పారు. కమిట్ మెంట్ ప్రకారం పరశురామ్ మళ్లీ వెనక్కి వచ్చి చైతూతో సినిమా చేయడంపై ఇండస్ట్రీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతుంది. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీలో మంచి హిట్ ఇచ్చిన పరశురామ్… చాలా ఓపిక్కగా టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కోసం ఎదురు చూశాడు. వేరే ఛాన్స్ వచ్చినా కూడా చేయకుండా.. సూపర్ స్టార్ తో సినిమా చేయాలని పట్టుదలతో ఎదురు చూశాడు. ఆయన శ్రమ ఫలించి చాలా గ్యాప్ తరువాత సర్కారువారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు రానుంది. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ ని అందించారు. ఈ సినిమా తరువాత చేయబోయే త‌న నెక్ట్స్ మూవీపై రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ పరశురామ్. అంతకు ముందు నుంచే హీరో నాగ చైతన్యతో ..పరశురామ్ సినిమా ఉండనుందనే టాక్ వచ్చింది. మహేష్ బాబుతో సినిమా తరువాత చైత‌న్య ప్రాజెక్టును పరశురామ్ చేయకపోవచ్చుననే ప్రచారం ఇండస్ట్రీలోగట్టిగా జరిగింది. ఈ విషయంలో పరుశురామ్ పక్కాగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement