Wednesday, May 8, 2024

స్వాతంత్య్ర దినోత్సవం రోజే అమానవీయ ఘటన

స్వాతంత్య్ర దినోత్సవం రోజే పాకిస్థాన్​లో అమానవీయ సంఘటన జరిగింది.  టిక్ టాక్ వీడియోలు చేసే ఓ యువతిపై వందలాది మంది దారుణంగా ప్రవర్తించారు. దాదాపు 400 మంది మృగాళ్ల నుంచి తప్పించుకునేందుకు ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసలే అయ్యాయి.

ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లాహోర్ లోని గ్రేటర్ ఇక్బాల్ పార్క్ లో తన సహచరులతో కలిసి వీడియో తీస్తున్న టిక్ టాక్ స్టార్ పై అల్లరి మూక దాడి చేసి అకృత్యాలకు పాల్పడ్డారు. యువతిని వివస్త్రను చేసి.. గాల్లోకి ఎగరేశారు. ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచేశారు. సెల్ ఫోన్ ను లాక్కున్నారు. డబ్బులను దొంగిలించారు. ఈ సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.  ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ అడ్డా స్టేషన్ పోలీసులు నిందితులపై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

ఇది కూడా చదవండిః రేషన్ కావాలా..? అయితే ఇది తప్పనిసరి

Advertisement

తాజా వార్తలు

Advertisement