Friday, April 26, 2024

కోహ్లీ అందుకే విఫలమవుతున్నాడు: సచిన్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. లార్డ్స్ లో టీమిండియా విజయం సాధించినప్పటికి కోహ్లీ పేలవ ఫామ్ అభిమానులను కంగారుపెడుతోంది. కోహ్లీ గత రెండెళ్లుగా ఏ ఫార్మాట్ లోను సెంచరీ సాధించలేదు. కనీసం ఇంగ్లండ్ పర్యటనలోనైనా ఆ ముచ్చట తీరుస్తాడని అభిమానులు ఆశించినా.. ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేశాడు. ఇప్పటికే ముగిసిన రెండు టెస్ట్‌ల్లో కేవలం 62 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి వరుస వైఫల్యాలపై క్రికెట్‌ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు.

కోహ్లి మంచి ఆరంభం అందకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడని, ఆ ఆందోళన అతని ఫుట్‌వర్క్‌పై ప్రభావం చూపుతుందని, ఆ కారణంగానే కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఒత్తిడిలో పాదాలు కదపలేకపోవడంతో పాటు స్టంప్స్‌ను దాటి మరీ దూరంగా వెళ్తున్నాడని, ఈ క్రమంలో సులువగా వికెట్‌ను సమర్పించుకుంటున్నాడని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్‌కు శుభారంభం దక్కడం లేదని కోహ్లి ఒత్తిడిని లోనవుతున్నాడని, అతని ఆలోచనా విధానమే సమస్యలకు దారి తీస్తుందని తెలిపాడు. ఫుట్‌ వర్క్‌ సమస్యకు పరిష్కారం త్వరగా లభిస్తుందని, అదే ఒత్తిడిని అధిగమించాలంటే చాలా సమయం పడుతుందని, ఈ మధ్యలో కెరీర్‌ ముగిసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సచిన్‌ విశ్లేషించాడు.

ఇది కూడా చదవండి:ప్రపంచ క్రికెట్ మొనగాడి ప్రస్థానానికి నేటితో 12 ఏళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement