Wednesday, April 24, 2024

బేజారయిన మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభాలను కూడగట్టుకున్న మార్కెట్లు తర్వాత నష్టాలను చవిచూశాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటి వరకు స్థిరంగా కొనసాగినప్పటికీ… ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో చివరకు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 162 పాయింట్లు నష్టపోయి 55,629కి చేరింది. నిఫ్టీ 45 పాయింట్లు కోల్పోయి 16,568 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ లిస్ట్ లో అల్ట్రాటెక్ సిమెంట్ (2.46%), బజాజ్ ఫైనాన్స్ (2.12%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.78%), నెస్లే ఇండియా (0.91%), బజాజ్ ఆటో (0.89%) ఉండగా.. టాప్ లూజర్స్ లిస్ట్ లో
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.80%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.42%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.11%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.06%), యాక్సిస్ బ్యాంక్ (-0.74%) ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ప్రపంచ క్రికెట్ మొనగాడి ప్రస్థానానికి నేటితో 12 ఏళ్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement