Wednesday, May 8, 2024

శివాల‌యంలో పాలు తాగుతున్న నంది విగ్రహం..!

దేవుడి విషయంలో ఎన్నో నమ్మలేని విష‌యాలు వింటుంటాం.. చూస్తుంటాం… ఎలాగంటే గణేశుడి విగ్రహం పాలు తాగడం, సాయిబాబా విభూతి రాల్చడం.. శ్రీరాముడి విగ్రహం కన్నీళ్లు పెట్టుకోవడం.. ఇలా ఎన్నెన్నో విచిత్ర సంఘటనలు మన కళ్లెదుటే జరిగాయి. ఇప్పుడు కూడా అలాంటిదే.. శివుడి దగ్గర ఉండే నంది విగ్రహం పాలు తాగుతుందట ఈ విషయం ఆసక్తికరంగా మారింది. ఈ వింత ఘటన ఆదిలాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. జిల్లాలోని క్రాంతినగర్, గాండ్ల సంఘం శివాలయంలో భక్తులు నందికి పాలు పోశారు. ఎన్నడూ లేనిది నంది పాలు తాగడం మొదలుపెట్టింది. అది గమనించిన భక్తులు గిన్నెలు, చెంచాలతో నందికి పాలు తాగించారు. అయితే.. నిజంగా నంది పాలు తాగుతోందా ? లేదంటే విగ్రహం పాలను పీల్చేస్తుందా ? అన్న సందిగ్ధం నెలకొంది. శివాలయంలో ఉన్న నందీశ్వరుడు పాలు తాగేస్తున్నాడనే విషయం తెలుసుకున్న ప్ర‌జ‌లు నందికి పాలు తాగించేందుకు, ఆ వింతను కళ్లారా చూసేందుకు క్యూ కడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement