Saturday, April 27, 2024

త‌ల్లి బ‌ర్త్ డే – ఎంజాయ్ చేస్తోన్న న‌టి అమ‌లాపాల్

త‌న త‌ల్లి అన్నీస్ పాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇంట్లోనే త‌ల్లికి సేవ‌లు చేస్తోంది హీరోయిన్ అమ‌లాపాల్. త‌న త‌ల్లిని బుజ్జగిస్తూ.. లాలిస్తూ సంతోషపెడుతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుంది అమలా పాల్. . ఇద్దరు క్యాజువల్ డ్రెస్ లో ఉన్నారు. అన్నీస్ పాల్ గాగుల్స్ ధరించి కూతురు ప్రేమను అనుభూతి చెందుతోంది.
ఈ ఫొటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. ‘నా రాణి.. నా బేబీ.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ’ అంటూ విషెస్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కేరళకు చెందిన అమలా పాల్ 1991లో పాల్ వర్గీస్, అన్నీస్ పాల్ దంపతులకు జన్మించింది. అమపాల్ కు అమ్మనాన్నతో పాటు సోదరుడు అబిజిత్ పాల్ కూడా ఉన్నారు. ఈయన కూడా సినీ రంగం ప్రవేశం చేసి ఉన్నాడు. అయితే 2017లో పాల్ వర్గీస్ మరణించాడు. అప్పటి నుంచి అమలా పాల్ తల్లితోనే ఉంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement