Monday, May 13, 2024

మేయ‌ర్ ఎన్నిక‌లో.. ఆమ్ ఆద్మీకి మ‌రోసారి చుక్కెదురు

ఆమ్ ఆద్మీ పార్టీకి మ‌రోసారి చుక్కెదురైంది. కొత్త మేయర్‌ను ఎన్నుకునే కసరత్తు వరుసగా మూడోసారి విఫలమైంది.కాగా ఆప్, బీజేపీ సభ్యులు సోమవారం ఢిల్లీ మున్సిపల్ హౌజ్ లో గందరగోళం సృష్టించారు. దాంతో సభ వాయిదా పడింది. డిసెంబరు 4న మున్సిపల్ ఎన్నికల తర్వాత మూడోసారి సమావేశమైన సభలో నగరంలోని ప్రముఖులకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఆప్ సభ్యులు నిరసనకు దిగడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎల్‌జీ వీకే సక్సేనా నామినేట్ చేసిన సభ్యులను కూడా మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికల్లో ఓటు వేసేందుకు అనుమతిస్తామని ప్రిసైడింగ్ అధికారి సత్య శర్మ ప్రకటించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ప్రకటన తర్వాత ఆప్ కౌన్సిలర్లు పెద్దపెట్టున నినాదాలు చేశారు. దాంతో, గందరగోళం మధ్య సభ, మేయర్ ఎన్నికలను మళ్లీ వాయిదా వేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement