Thursday, May 16, 2024

మ‌హారాష్ట్ర మంత్రికి మావోయిస్టుల బెదిరింపు లేఖ – భ‌ద్ర‌త పెంచిన ప్ర‌భుత్వం

సాక్షాత్త్ మంత్రినే బెదిరించారు మావోయిస్టులు. మావోయిస్టుల పేరుతో మ‌హారాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండేకి బెదిరింపు లేఖ‌లు వ‌చ్చాయి. దాంతో మంత్రి భ‌ద్ర‌తా సిబ్బంది అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ మేర‌కు మంత్రి నివాసం వద్ద బద్రతను పెంచారు. ఈ లేఖకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఈ లేఖపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా తనకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయని మంత్రి ఏక్‌‌నాథ్ షిండే మీడియాకు తెలిపారు. గడ్చిరోలికి మంత్రిగా ఉన్న తాను అక్కడున్న ప్రజలను కాపాడటమే కాకుండా ,జిల్లాను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాన‌ని తెలిపారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులతో పోరాడాలంటే మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక్కటే మార్గమ‌ని షిండే సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement