Friday, April 26, 2024

త్రిపుర సీఎంగా మాణిక్ సాహా ప్రమాణం

త్రిపుర 11వ ముఖ్యమంత్రిగా రాజ్యసభ ఎంపీ మాణిక్ సాహా ప్రమాణ స్వీకారం చేశారు. అగర్తలలోని రాజ్ భవన్ లో ఆయన చేత గవర్నర్ సత్యదేవ్ నరేన్ ఆర్య ప్రమాణం చేయించారు. సీఎంతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి కృషి చేస్తామని కొత్త సీఎం మాణిక్ సాహా అన్నారు.

కాగా, శనివారం సీఎం పదవికి బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీ జాతీయ నాయకత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు ఆయన సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం బీజేఎల్పీ అత్యవసరంగా సమావేశమై  మాణిక్ సాహను నూతన సీఎంగా ఎన్నుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement