Saturday, April 27, 2024

Breaking : యాక్సిడెంట్ కి గురైన బ‌స్సు – న‌లుగురు మృతి-ఏడుగురికి తీవ్ర గాయాలు

రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘ‌ట‌న‌లో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్సు ఉదయపూర్ నుంచి జైపూర్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement