Saturday, April 27, 2024

వరద బాధిత ప్రాంతాల్లో రేపు కేసీఆర్ పర్యటన..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. వడగళ్ల వానకు చొప్పదండి నియోజకవర్గంలోని లక్ష్మీపూర్, చిప్పకుర్తి గ్రామంలో తీవ్ర పంటనష్టం జరిగింది. ఈ గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని సీఎం పరిశీలించనున్నారు. రామచంద్రాపూర్ శివారు చిప్పకుర్తి శివారులో కొత్త రవీందర్ కు చెందిన మూడు ఎకరాల కరబూజ తోట పూర్తిగా ధ్వంసమై దాదాపు రూ.5లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. లక్ష్మీపూర్ లో ధ్యావ రామచంద్రారెడ్డికి చెందిన 10ఎకరాల కరబూజ తోట పూర్తిగా ధ్వంసమైంది. దీంతో రైతుకు రూ.15లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఈ రెండు ప్రాంతాల్లో సీఎం పర్యటించి, నష్టాన్ని పరిశీలించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement