Thursday, April 18, 2024

దేశంలో మరో 699 కరోనా కేసులు నమోదు

దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా… 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఒడిశా (1), కేరళ (1)లో ఇద్దరు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 5,30,808కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,59,617 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.01 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement