Saturday, April 27, 2024

సీఎం కేసిఆర్ కి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో రాని కచ్చితమైన ఫలితం

సీఎం కేసీఆర్ కరోనా మహమ్మారి నుంచి కొలుకున్నారని నిన్న వార్తలు వచ్చాయి. కెసిఆర్ కు నిన్న తన వ్యవసాయ క్షేత్రంలో కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాపిడ్ యాంటీజెన్ తో పాటు ఆర్టీపీసియార్ పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. యాంటిజెన్ టెస్టులో సిఎం కెసిఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే యాంటీజెన్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన ఆర్ టి పిసిఆర్ కొన్నిసార్లు పాజిటివ్గా తేలిపోతుంది. నిన్న యాంటిజెన్ పరీక్షలో కేసీఆర్ కు నెగెటివ్ వచ్చింది. దీంతే 2-3 రోజుల్లో కేసీఆర్ కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయనున్నారు. సీఎం కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని..వైరస్ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి కచ్చితమైన ఫలితం రాదన్నారు డా.ఎంవీరావు.

Advertisement

తాజా వార్తలు

Advertisement