Thursday, May 9, 2024

మాజీ ప్రధానికి నెగటివ్.. ఆసుపత్రి నుంచి మన్మోహన్ డిశ్ఛార్జ్

కరోనా బారినపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోలుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి మన్మోహన్ సింగ్ ను డిశ్చార్జ్ చేశారు. 88 ఏళ్ల మన్మోహన్ సింగ్ కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 19న ఎయిమ్స్ లో చేరారు. తేలికపాటి లక్షణాలే కనిపించినప్పటికీ ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారు. తాజాగా కరోనా నెగెటివ్ రావడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. కాగా మన్మోహన్ రెండు డోసుల కొవాగ్జిన్ టీకాను తీసుకున్నారు. మార్చి 4న తొలి డోసు, ఏప్రిల్ 3న రెండో డోసు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement