Saturday, April 27, 2024

14 కేంద్రాల్లో పాస్ పోర్టు సేవలు నిలిపివేత

తెలంగాణలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా అందిస్తున్న పాస్‌ పోర్టు సేవలు రేపటి నుంచి నిలిపివేస్తున్నట్లు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. మే 14వ తేదీ వరకు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, మేడ్చల్‌ తపాలా కార్యాలయాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో వీటిని పునరుద్ధరించే ముందు తపాలా శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలోని ఐదు పాస్‌ పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట్‌, అమీర్‌పేట్‌, టోలీచౌకీ, నిజామాబాద్‌, కరీంనగర్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో సేవలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement