Friday, May 24, 2024

ఆర్ ఎస్ బ్ర‌ద‌ర్స్ షాపింగ్ మాల్స్ లో -ఐటి దాడులు

ఆర్ ఎస్ బ్ర‌ద‌ర్స్ షాపింగ్ మాల్స్ లో ఐటీ దాడులు జ‌రిగాయి. హైదరాబాద్ మహానగరంలోని ఆరు చోట్ల తాజాగా ఐటి అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. షాపింగ్ మాల్స్ కు చెందిన ఆఫీసులతో పాటు వారి ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. కూకట్ ప‌ల్లి , కూకట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డ్, జూబ్లీహిల్స్, దిల్ సుఖ్ నగర్‌ సహా మరో పది చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ .. వ్యాపార సంస్థలలో ఐటి అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ ల లో, వాటి కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ఎస్ బ్రదర్స్ భారీగా పెట్టుబడి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఐటి అధికారులు దాడులు చేసినట్లు సమాచారం . ఇక ఈ దాడిలపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement